TAX: ఏడాది ఆదాయం రూ. 9.5 లక్షల వరకు పన్ను లేనట్టే... అదెలాగంటే..!

  • పన్ను రాయితీలు సక్రమంగా వాడుకుంటే చాలు
  • ఆదాయం పెరిగినా పన్ను భారం తప్పే మార్గాలు
  • సెక్షన్ 80-సీ, స్టాండర్డ్ డిడక్షన్, 87-ఏ రిబేట్ లను వాడుకోవాలని సలహా

2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను, మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలు నిన్న పార్లమెంట్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.50 లక్షలు కాగా, ఇకపై రూ. 5 లక్షల వరకూ పన్ను చెల్లింపులపై రిబేట్ ఇవ్వనున్నామని పీయుష్ గోయల్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎగువ మధ్య తరగతికీ ఉపశమనం కలుగుతుండగా, మినహాయింపులను సరిగ్గా వినియోగించుకుంటే, ఆదాయం రూ. 9.55 లక్షల వరకు  పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా, సెక్షన్ 80-సీ, సెక్షన్ 80-డి  కింద పన్ను రాయితీలు లభించే  మార్గాలను చూసుకోవడమే. అదెలాగంటే...

ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం రూ. 9.5 లక్షలు అనుకుందాం. ఇక ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలు, సెక్షన్ 80-సీ మినహాయింపులు రూ. 1.50 లక్షలు, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రూ. 2 లక్షలు (పన్ను పరిధిలోకి రానిది), ఎన్పీఎస్ పెట్టుబడి రూ. 50 వేలు, ఆరోగ్య బీమా ప్రీమియం రూ. 25 వేలు, వృధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్య భీమా 25 వేలుగా భావించి, వాటిని తీసివేస్తే, నికరంగా పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ. 5 లక్షలు ఉంటుంది. దీనిపై రూ. 12,500 వేలు చెల్లించాల్సివుంటుంది. సెక్షన్ 87-ఏ కింద గరిష్ఠ రిబేటు రూ. 12,500 ఉంది కాబట్టి, కేంద్రానికి చెల్లించాల్సిన పన్ను ఏమీ ఉండదు.

More Telugu News