New delhi: కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఏపీ భవన్ లో కాగడాల ప్రదర్శన

  • ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యుల కాగడాల ప్రదర్శన
  • నల్ల చొక్కాలు ధరించి నిరసన
  • ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అంటూ నినాదాలు

ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఉత్తరాంధ్ర చర్చా వేదిక నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించిన ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యులు ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించారు. 

More Telugu News