hema: పూరి జగన్నాథ్ మబ్బులు కమ్మేసిన సూర్యుడిలా వున్నాడు: నటి హేమ

  • పూరి దేవుడిచ్చిన అన్నయ్య
  • కోపం వచ్చి తిట్టేశాను
  • మళ్లీ హిట్లు కొడతాడు

ఏ విషయాన్ని గురించైనా ముక్కుసూటిగా మాట్లాడటం నటి హేమ నైజం. అలాంటి హేమ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పూరి జగన్నాథ్ ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె తనదైన శైలిలో స్పందించారు. "పూరి జగన్నాథ్ ను నేను అన్నయ్య అంటాను .. దేవుడిచ్చిన అన్నయ్యగా భావిస్తాను. తాను కూడా నాకు అంతే ప్రాధాన్యతనిస్తాడు.

మా అమ్మాయి ఓణీల ఫంక్షన్ కి రాకుండా అన్నయ్య వేరే ఫంక్షన్ కి వెళ్లాడు .. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆఫీసుకి వెళ్లి తిట్టేశాను .. మాట్లాడటం మానేశాను. ఇక నువ్వు మారవు .. ఇంతే అని చెప్పేసి వచ్చేశాను. అప్పటి నుంచి ఫోన్ చేయలేదు .. ఆఫీసుకి వెళ్లలేదు.

అయినా నేను కనపడగానే వచ్చి చనువుగా మాట్లాడుతూనే ఉంటాడు. ప్రస్తుతం అన్నయ్య మబ్బులు కమ్మేసిన సూర్యుడిలా వున్నాడు. త్వరలోనే ఆ మబ్బులు తొలగిపోతాయి .. అందులో నుంచి అన్నయ్య బయటికి వస్తాడు. ఇంతకుముందు మాదిరిగానే వరుస విజయాలను అందుకుంటాడు .. ఆ నమ్మకం నాకు వుంది" అని చెప్పుకొచ్చారు.  

More Telugu News