airtel: ఎయిర్ టెల్ కు షాక్.. దూరమైన 5.7 కోట్ల మంది వినియోగదారులు

  • డిసెంబర్ లో భారీగా తగ్గిన ఎయిర్ టెల్ కస్టమర్ బేస్
  • డిసెంబర్ చివరి నాటికి ఎయిర్ టెల్ కస్టమర్ల సంఖ్య 28.42 కోట్లు
  • ఎయిర్ టెల్, జియోకు మధ్య తేడా 42 లక్షలు మాత్రమే

దేశంలోనే అతి పెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ కు భారీ షాక్ తగిలింది. డిసెంబర్ లో ఏకంగా 5.7 కోట్ల మంది వినియోగదారులను ఆ సంస్థ కోల్పోయింది. దీంతో నవంబర్ లో 34.1 కోట్ల మంది వినియోగదారులతో ప్రత్యర్థి సంస్థలకు అందనంత ఎత్తులో ఉన్న ఎయిర్ టెల్ కస్టమర్ బేస్ డిసెంబర్ చివరి నాటికి 28.42 కోట్లకు పడిపోయింది. ఈ క్రమంలో రిలయన్స్ జియోకు సమీపంలోకి వచ్చింది. డిసెంబర్ చివరి నాటికి జియో కస్టమర్ బేస్ 28 కోట్లుగా ఉంది. దీంతో, ఈ రెండు సంస్థల మధ్య వ్యత్యాసం కేవలం 42 లక్షలు మాత్రమే కావడం గమనార్హం.

More Telugu News