akhil: అఖిల్ తదుపరి సినిమా దర్శకుడిగా క్రిష్?

  • నిరాశ పరిచిన 'మిస్టర్ మజ్ను'
  • తదుపరి సినిమాపై ఊహాగానాలు
  • తెరపైకి దర్శకుడు క్రిష్ పేరు

అఖిల్ తన ప్రతి సినిమా విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. అయినా ఇంతవరకూ ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తోంది. ఈ నేపథ్యంలో అఖిల్ నాల్గొవ సినిమా శ్రీను వైట్లతో ఉంటుందనీ .. 'మలుపు' దర్శకుడు సత్యతో ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఇక తాజాగా దర్శకుడు క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల నాగార్జునను కలిసిన క్రిష్ .. అఖిల్ కోసం ఒక కథను వినిపించాడట. ఆ కథ నాగార్జునను బాగా ఇంప్రెస్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. క్రిష్ తో తన సొంత బ్యానర్లో ఆ సినిమా చేయడానికి నాగార్జున ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో క్రిష్ కూడా ఒక భాగస్వామి కానున్నాడని చెబుతున్నారు. 'మహానాయకుడు' రిలీజ్ తరువాత క్రిష్ .. అఖిల్ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెడతాడని చెప్పుకుంటున్నారు. 

More Telugu News