Samanta: ఆరు గంటలు దాటితే స్మార్ట్ ఫోన్ స్విచ్చాఫ్... ఆపై చైతూతోనే అంటున్న సమంత!

  • కుటుంబ జీవితానికి అడ్డంకి కాకుండా జాగ్రత్తలు
  • సినిమా విషయాలు గుమ్మం బయటే
  • ప్రస్తుతం భర్తతో కలిసి 'మజిలీ'లో నటిస్తున్న సమంత

తన సినిమా జీవితం, కుటుంబ జీవితానికి ఎంతమాత్రం అడ్డంకి కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నానని అక్కినేని వారింటి కోడలు, నటి సమంత చెబుతోంది. తన భర్త చైతూ కూడా టాలీవుడ్ లోనే ఉండటంతో, తమ ఇల్లంతా సినిమాలతో మమేకమై పోయివుంటుందని, అయితే, ఇంటికి వెళ్లిన తరువాత మాత్రం సినిమా విషయాలు అతి తక్కువగా మాత్రమే ప్రస్తావనకు వస్తాయని అంటోంది.

సాయంత్రం ఆరు గంటలు దాటితే తన సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయిపోతుందని, ఆపై సమయమంతా చైతూ గురించి, ఇంటి గురించి, తన గురించి మాత్రమే ఆలోచిస్తుంటానని చెప్పింది. చైతూ కూడా సినిమా విషయాలను గుమ్మం బయటే వదిలేసి వస్తాడని, దీంతో తమకు కొంత సమయం మిగులుతోందని చెప్పింది. మొత్తానికి వృత్తి జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ ఎంతెంత సమయం కేటాయించాలో సమంతకు బాగానే తెలిసిపోయినట్టుంది. ప్రస్తుతం సమంత తన జీవిత భాగస్వామితో కలిసి 'మజిలీ' చిత్రంలో నటిస్తుందన్న సంగతి తెలిసిందే.

More Telugu News