Sridevi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బరువు పెంచుతున్న కథానాయిక
  • ఎల్బీ స్టేడియంలో బాలకృష్ణ షూటింగ్ 
  • 'ఆల్ ఈజ్ వెల్'లో నాగశౌర్య  

*  'ధడక్' చిత్రంతో కథానాయికగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కూతురు జాన్వి తన తదుపరి చిత్రం కోసం బరువు పెరుగుతోంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి వార్ పైలట్ అయిన గుంజన్ సక్సేనా బయోపిక్ గా రూపొందే ఈ చిత్రం కోసం జాన్వి ఏడెనిమిది కిలోల బరువు పెంచుతోందట.
*  బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరుగుతోంది. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన కీలక సన్నివేశాలను, ఎన్టీఆర్ ప్రసంగాన్ని దర్శకుడు క్రిష్ అక్కడ చిత్రీకరిస్తున్నారు.
*  'శ్రీనివాస కల్యాణం' చిత్రం తర్వాత దర్శకుడు సతీష్ వేగేశ్న తన తదుపరి చిత్రం కోసం 'ఆల్ ఈజ్ వెల్' టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నాడు. ఇందులో కథానాయకుడి పాత్ర కోసం నాగశౌర్యను తీసుకుంటున్నారట.  

More Telugu News