Jana Sena: రేపటి ఏపీ బంద్ లో పాల్గొనని ‘జనసేన’

  • అత్యవసరమైతే తప్ప బంద్ కు దిగం
  • ఇది తమ పార్టీ విధానం
  • అందుకే రేపటి బంద్ లో పాల్గొనట్లేదు: జనసేన పార్టీ

రాష్ట్ర పునర్విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఏపీలో రేపు బంద్ జరగనున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు జరగనున్న ఈ బంద్ లో తాము పాల్గొనడం లేదని జనసేన పార్టీ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప బంద్ కు దిగకూడదన్నది తమ పార్టీ విధానమని, అందుకు అనుగుణంగానే రేపటి బంద్ లో తాము పాల్గొనడం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.

More Telugu News