Maharshi: ‘మహర్షి’పై వస్తున్న రూమర్లపై స్పందించిన దిల్ రాజు

  • మహేశ్ కథానాయకుడిగా ‘మహర్షి’
  • కథానాయికగా నటిస్తున్న పూజా హెగ్డే
  • ఏప్రిల్ 25న విడుదల

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ని వేసవి కానుకగా ఏప్రిల్ 25న విడుదల చేయనున్నామని చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ రూమర్లు రావడంతో దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పూ లేదని ఆయన తెలిపారు.

More Telugu News