Haryana: జింద్ నియోజకవర్గ ఉపఎన్నికలో ముందంజలో బీజేపీ

  • సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో అనివార్యమైన ఉప ఎన్నిక
  • కాంగ్రెస్ నుంచి పోటీలో రణదీప్ సింగ్ సుర్జేవాలా
  • ఓట్ల లెక్కింపులో మూడో స్థానంలో కాంగ్రెస్

హరియాణాలోని జింద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హరి చంద్ మిద్దా మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ నియోజకవర్గంలో ఈ నెల 27న ఉప ఎన్నిక జరిగింది. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టగా బీజేపీ అభ్యర్థి కృష్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి హరిచంద్ కుమారుడు కృష్ణ మిద్దా, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా, జననాయక్ జనతా పార్టీ నుంచి దిగ్విజయ్ చౌతాలా పోటీకి దిగారు. ఈ ఉప ఎన్నికలో ప్రస్తుతం బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. జననాయక్ జనతా పార్టీ రెండవ స్థానంలోనూ, కాంగ్రెస్ మూడవ స్థానంలోనూ కొనసాగుతున్నాయి.

More Telugu News