Telangana: తెలంగాణలో కూలిన ‘డబుల్ బెడ్రూమ్’ భవనం శ్లాబు.. నలుగురు కార్మికుల దుర్మరణం!

  • మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో ఘటన
  • తీవ్రంగా గాయపడ్డ నలుగురు కార్మికులు
  • కేసు నమోదుచేసిన పోలీసులు

తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఈరోజు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాంపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ భవనం శ్లాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈరోజు భనవం పదో అంతస్తులో పనులు జరుగుతుండగా శ్లాబు పడిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని తోటి కార్మికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిల్డర్ నిర్మాణంలో నాణ్యత పాటిస్తున్నారా? కార్మికుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News