rai lakshmi: 'వేరీజ్ ద వెంకట లక్ష్మీ' నుంచి లిరికల్ సాంగ్ వీడియో

  • రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారి 
  • దర్శకుడిగా కిషోర్ కుమార్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  

రాయ్ లక్ష్మీ వెండితెరపై గ్లామరస్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు .. తమిళ భాషల్లో ఆమెకి ఎంతోమంది అభిమానులు వున్నారు. అలాంటి రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారిగా 'వేరీజ్ ద వెంకటలక్ష్మీ' సినిమా రూపొందుతోంది. శ్రీధర్ రెడ్డి .. ఆనంద్ రెడ్డి .. ఆర్కే రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఏ మాయ చేసిందో .. ఏ మంత్రం వేసిందో .. చూపులతో తీసిందే ప్రాణం. ఊరించే ఆ అందం .. ఊహల్లో ఆనందం .. గుండెల్లో గుచ్చిందే బాణం" అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. రాయ్ లక్ష్మీ పై మనసు పారేసుకున్న కమెడియన్స్ ప్రవీణ్ .. మధుసూదన్ ఊహలకు అక్షర రూపంగా ఈ పాట వస్తుందని అర్థమవుతోంది. బాలాజీ సాహిత్యం .. హరి గౌర సంగీతం - గానం ఆకట్టుకునేలా వున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News