akhil: స్పోర్ట్స్ నేపథ్యంలో అఖిల్ నాల్గొవ సినిమా

  • ఇకపై గ్యాప్ తీసుకోను 
  • తదుపరి సినిమాకి సన్నాహాలు
  •  మార్చి నుంచి షూటింగ్ మొదలు  

 అఖిల్ తన మొదటి సినిమాకి .. రెండవ సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. మూడవ సినిమా 'మిస్టర్ మజ్ను'కి అనుకోకుండానే గ్యాప్ పెరిగిపోయింది. అందువలన ఈ సారి ఆయన ఎక్కువ గ్యాప్ తీసుకోదలచుకోలేదు. తన తదుపరి సినిమా వెంటనే సెట్స్ పైకి వెళుతుందని కూడా ఆయన ఇటీవల చెప్పాడు. అయితే అఖిల్ నాల్గొవ సినిమా శ్రీను వైట్లతో ఉండనుందంటూ ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేసింది.

దాంతో అఖిల్ అభిమానులు అయోమయానికి లోనయ్యారు. వరుస పరాజయాలతో వున్న శ్రీను వైట్ల తమ హీరోకి ఎలా హిట్ ఇవ్వగలడంటూ చర్చలు జరిగాయి. అయితే ఈ వార్తలో నిజం లేదనే స్పష్టత వచ్చింది. అఖిల్ తన నాల్గొవ సినిమాను 'మలుపు' దర్శకుడు 'సత్య'తో చేయనున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

More Telugu News