old: ఏపీలో ఘోరం.. నిద్రిస్తున్న వృద్ధురాలిని పీక్కుతున్న కుక్కలు

  • శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో ఘటన
  • ఇంటి గడపలో నిద్రించిన వృద్ధురాలు
  • బయటకు ఈడ్చుకుపోయి పీక్కుతిన్న కుక్కలు

శ్రీకాకుళం జిల్లాలో ఒళ్లు జలదరించే ఘటన జరిగింది. ఓ వృద్ధురాలిని వీధికుక్కలు పీక్కుతిన్నాయి. వంగర మండలం శ్రీహరిపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే, అంపిల్లి రాముడమ్మ (65) అనే వృద్ధురాలు ఇంటి గడపలో రాత్రి నిద్రించింది. అటువైపు గుంపుగా వచ్చిన వీధి కుక్కలు... ఆమెను బయటకు ఈడ్చుకుపోయాయి. అనంతరం ఆమెను పీక్కుతిన్నాయి. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

More Telugu News