modi: కళ్లుతిరిగి కిందపడిపోయిన కెమెరామెన్.. ప్రసంగాన్ని ఆపేసిన మోదీ

  • సూరత్ లో మోదీ ప్రసంగిస్తుండగా పడిపోయిన కెమెరామెన్
  • ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ వేదికపై నుంచి మోదీ ఆదేశం
  • ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగించిన మోదీ

గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం కవరేజ్ కు వచ్చిన కిషన్ రమోలియా అనే కెమెరామెన్ సొమ్మసిల్లి, కళ్లు తిరిగి కిందకు పడిపోయారు. దీంతో, మోదీ తన ప్రసంగాన్ని ఆపివేశారు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వేదికపై నుంచే మోదీ ఆదేశించారు. దీంతో, కిషన్ ను బీజేపీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గతంలో కూడా మోదీ తన ప్రసంగాన్ని ఒకసారి మధ్యలో ఆపేశారు. సమీపంలో ఉన్న మసీదు నుంచి అజాన్ వినపడగానే ప్రసంగాన్ని ఆపేశారు. అజాన్ ముగిసిన తర్వాత ప్రసంగాన్ని కొనసాగించారు.

More Telugu News