somu veerraju: కాపులకు రిజర్వేషన్లు కూడా మోదీ ఘనతే: సోము వీర్రాజు

  • కాపు రిజర్వేషన్లు మోదీ ఖాతాలోకే వెళ్లాలి
  • కేంద్రం సహకారం వల్లే రాష్ట్ర ప్రభుత్వం విజయాలు సాధించింది
  • 74 అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోంది

ఈబీసీలకు కల్పించిన 10 శాతం కోటాలో 5 శాతాన్ని బీసీలకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బీజేపీ నేత సోము వీర్రాజు మాట్లాడుతూ... కాపు రిజర్వేషన్లు కూడా ప్రధాని మోదీ ఘనతే అని చెప్పారు. ఈ రిజర్వేషన్లు కూడా మోదీ ఖాతాలోకే వెళ్లాలని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు చెప్పారని... ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. బీసీ ఎఫ్ కేటగిరీ తీసుకొచ్చి ఉంటే ఆ ఘతన చంద్రబాబుదయ్యేదని చెప్పారు. కేంద్రం అందించిన సహకారం వల్లే రాష్ట్ర ప్రభుత్వం విజయాలను సాధించిందని చెప్పారు. 24 గంటల విద్యుత్తు సరఫరా కూడా కేంద్ర సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు. 74 అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు.

More Telugu News