Rahul Gandhi: పారికర్ ను కలిసిన తర్వాత రాఫెల్ డీల్ పై రాహుల్ వ్యాఖ్యలు

  • నిన్న మనోహర్ పారికర్ ను కలిసిన రాహుల్
  • ఇది వ్యక్తిగత పర్యటన అని నిన్న చెప్పిన రాహుల్
  • రాఫెల్ కొత్త ఒప్పందంతో సంబంధం లేదని పారికర్ చెప్పారన్న రాహుల్

గోవా ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిన్న కలిసిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమే అని చెప్పారు. ఈ మాట చెప్పి గంటలు కూడా గడవక ముందే రాఫెల్ డీల్ పై రాహుల్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాఫెల్ కొత్త డీల్ తో తనకు సంబంధం లేదని పారికర్ తనతో చెప్పారని అన్నారు.  

More Telugu News