Vidyabalan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో బయోపిక్ లో విద్యాబాలన్ 
  • తేజ దర్శకత్వంలో విశాల్ సినిమా 
  • 'ఆల్ ఈజ్ వెల్' అంటున్న దర్శకుడు  

 *  బయోపిక్ లలో నటిస్తూ పేరు తెచ్చుకుంటున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజాగా మరో బయోపిక్ లో నటించనుంది. హ్యూమన్ కంప్యూటర్ గా పేరు తెచ్చుకున్న గణిత మేధావి శకుంతలాదేవి కథను తెరకెక్కించడానికి దర్శకురాలు అను మీనన్  ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషిస్తుందట.
*  ప్రముఖ తమిళ హీరో విశాల్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని చాల కాలంగా ఎదురుచూస్తున్నాడు. అయితే, కారణాంతరాల వల్ల అది ఇంతవరకు ట్రాక్ లోకి ఎక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నట్టు తాజా సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం అక్టోబర్ నుంచి సెట్స్ కి వెళుతుందట.
*  'శతమానం భవతి', 'శ్రీనివాస కల్యాణం' చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించే ఈ చిత్రానికి 'ఆల్ ఈజ్ వెల్' అనే టైటిల్ని నిర్ణయించారు.    

More Telugu News