Jharkhand: ఝార్ఖండ్‌లో మావోలు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు.. ఐదుగురి మృతి

  • మావోలు తారసపడటంతో ఎదురు కాల్పులు
  • 2 ఏకే 47, 303 రైఫిల్, 2 తుపాకుల స్వాధీనం
  • మరికొందరు మావోల కోసం గాలింపు

ఝార్ఖండ్‌లోని సింగ్‌భం జిల్లాలో నేటి ఉదయం భద్రతా బలగాలు నిర్వహించిన కూంబింగ్‌లో భాగంగా.. మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47, ఒక 303 రైఫిల్, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది మావోలు తప్పించుకోవడంతో భద్రతా బలగాలు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో కేంద్ర సాయుధ బలగాలు, ఝార్ఖండ్ రాష్ట్ర పోలీసులు, కోబ్రా బెటాలియన్ పాల్గొంది.

More Telugu News