Chandrababu: వృద్ధ మహిళ పాదాలకు నమస్కరించిన చంద్రబాబు

  • పెన్షన్ డబ్బుల్లో రూ. 50 వేలు దాచిన ముత్యాలమ్మ
  • అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబుకు ఇచ్చిన వైనం
  • ఇదే స్ఫూర్తి అందరిలో రావాలన్న ముఖ్యమంత్రి

ముత్యాలమ్మ అనే వృద్ధ మహిళ పాదాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నమస్కరించారు. ముత్యాలమ్మది అనంతపురం జిల్లా రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామం. తనకు వచ్చిన పెన్షన్ లో రూ. 50 వేలను మిగిలించి... ఆ మొత్తాన్ని చంద్రబాబుకు అందించారు. ఈ మొత్తాన్ని అమరావతి నిర్మాణానికి ఉపయోగించాలని ముఖ్యమంత్రిని ఆమె కోరారు. ఆమె ఉదారతను చూసి చలించిపోయిన చంద్రబాబు... వెంటనే ఆమె పాదాలకు నమస్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గ్రామానికి నీళ్లు ఇస్తే... దాన్ని గుర్తుంచుకుని, అమరావతి నిర్మాణంలో తనకు కూడా బాధ్యత ఉందని చెబుతూ ఆ మహిళ రూ. 50 వేలు ఇచ్చారని కొనియాడారు. ఈ స్ఫూర్తి అందరిలో రావాలని పిలుపునిచ్చారు.

More Telugu News