Bysonpolo Ground: తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణానికి తొలగిన అడ్డంకి!

  • బైసన్ పోలో గ్రౌండ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • పాత కేసుల కొట్టివేత
  • త్వరలోనే బదలాయింపు ఉత్తర్వులు ఇవ్వనున్న కేంద్రం

తెలంగాణలో కొత్త సెక్రటేరియేట్ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. బైసన్ పోలో గ్రౌండ్స్ లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ భావించిన సంగతి తెలిసిందే. ఈ మైదానంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున భూమి బదలాయింపు విషయంలో కేంద్రం ఇన్నాళ్లూ జాప్యం చేస్తూ వచ్చింది. తాజాగా నేడు, బైసన్ పోలో గ్రౌండ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్థలంపై ఉన్న కేసులను కొట్టివేసింది. దీంతో సాధ్యమైనంత త్వరలోనే బైసన్ పోలో గ్రౌండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ, కేంద్రం ఉత్తర్వులు వెలువరుస్తుందని, ఆ వెంటనే కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని టీఆర్ఎస్ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

More Telugu News