kotla: కోట్ల టీడీపీలో చేరుతున్నారనే విషయంలో నాకు సమాచారం లేదు: డిప్యూటీ సీఎం కేఈ

  • కోట్ల టీడీపీలో చేరిక విషయంలో నన్ను ఎవరూ సంప్రదించలేదు
  • నాకు సమాచారం ఇచ్చారనే వార్తల్లో వాస్తవం లేదన్న కేఈ
  • చంద్రబాబును కలిసేందుకు అమరావతి వెళ్లిన కోట్ల

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు విందుకు కూడా ఆహ్వానించారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఆయన చంద్రబాబును కలిసేందుకు అమరావతికి కుటుంబ సమేతంగా బయల్దేరారు. మరోవైపు, కోట్ల టీడీపీలో చేరుతున్నారనే విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని కర్నూలు జిల్లాకే చెందిన సీనియర్ నేత, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. తనకు సమాచారం ఇచ్చారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

More Telugu News