Andhra Pradesh: చుక్కల భూముల విషయంలో అధికారులు నాకే చుక్కలు చూపుతున్నారు!: చంద్రబాబు ఆగ్రహం

  • సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం ఏంటి?
  • ఆదేశాలు అమలుకావడం లేదన్న అధికారులు
  • నిర్లక్ష్యాన్ని సహించబోనని హెచ్చరించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చుక్కల భూముల సమస్యను ఇప్పటివరకూ పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చుక్కల భూముల విషయంలో అధికారులు తనకే చుక్కలు చూపుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిలో జిల్లా కలెక్టర్లతో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడారు. పాత రూల్ బుక్ పట్టుకుని ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు అధికారులకు సూచించారు.   ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు.

More Telugu News