venkatesh: నైజామ్ లో 20 కోట్ల షేర్ మార్కును క్రాస్ చేసిన 'ఎఫ్ 2'

  • ఈ నెల 12న వచ్చిన 'ఎఫ్ 2'
  • కొత్త సినిమాలు వచ్చినా తగ్గని ప్రభావం
  • అమెరికాలోను అదే జోరు         

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా తెరకెక్కింది. పూర్తిస్థాయి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుని .. వసూళ్లపరంగా దూసుకుపోతోంది. అఖిల్ 'మిస్టర్ మజ్ను' .. 'మణికర్ణిక' చిత్రాలు థియేటర్లకు వస్తే, 'ఎఫ్ 2' వసూళ్లపై పెద్ద ప్రభావమే పడుతుందనే టాక్ వినిపించింది. కానీ ఆ రెండు సినిమాలు కూడా 'ఎఫ్ 2' వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

నైజామ్ లో 'ఎఫ్ 2' 20 కోట్ల షేర్ ను క్రాస్ చేయడం విశేషం. భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే సాధించగలిగే ఈ ఫీట్ ను 'ఎఫ్ 2' అవలీలగా అందుకోవడం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ఈ సినిమా, 70 కోట్ల షేర్ మార్కును క్రాస్ చేసేసింది. 3వ వారంలోను ఈ సినిమా అమెరికాలోని 90 లొకేషన్లలో తన జోరును చూపుతుండటం విశేషం.

More Telugu News