Narendra Modi: అత్యుత్తమ మంత్రిగా రాజ్‌నాథ్‌సింగ్‌.. 'ఇండియా టుడే' సర్వేలో వెల్లడి

  • సర్వేలో పాల్గొన్న 13 వేల మంది 
  • సుష్మ, అరుణ్ జైట్లీ, గడ్కరి, నిర్మలకు తర్వాత స్థానాలు
  • ఆపదలో ఆదుకుంటారని సుష్మాస్వరాజ్‌కు కితాబు

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మోదీ మంత్రివర్గంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అత్యుత్తమ పనితీరుతో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు. ఇటీవల ఇండియా టుడే-కార్వీ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 13 వేల మందిలో ఎక్కువమంది రాజ్‌నాథ్‌కు జైకొట్టారు.

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మంత్రి సుష్మా స్వరాజ్‌ మరో ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె ట్విటర్‌లో చురుగ్గా వ్యవహరిస్తారని, విదేశాల్లో భారతీయులు ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆమె వేగంగా స్పందిస్తారని సర్వేలో అత్యధిక మంది తెలిపారు.

More Telugu News