Subhash Chandra: వాటాల విక్రయంపై వార్తలు.. కుదేలైన జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్!

  • యూకే, యూఎస్ కంపెనీలతో చర్చ
  • కొనుగోలుకు 3 కంపెనీలు సిద్ధం
  • 30 శాతం పడిపోయిన షేర్ విలువ

జీ ప్రమోటర్, చైర్మన్ సుభాష్ చంద్ర తన వాటాను విక్రయించారని వార్తలు రావడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ విలువ నేడు ఒక్కసారిగా పడిపోయింది. సుభాష్ తన వాటా అమ్మకంపై యూకే, యూఎస్ కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరిపారు. ఆయన వాటాను కొనుగోలు చేసేందుకు మూడు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. అయితే సుభాష్ తన వాటాను విక్రయించారని వార్తలు రావడంతో కంపెనీ షేరు విలువ 30 శాతం పడిపోయింది. అంతేకాదు, ఆ కంపెనీ షేర్లతో పాటు అనుంబంధ కంపెనీలైన డిష్‌ టీవీ(17 శాతం), జీ మీడియా(11శాతం) షేర్లు కూడా పడిపోయాయి.

More Telugu News