bride: పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో... పెళ్లికూతురు కిడ్నాప్

  • పెళ్లి అలంకరణ కోసం వెళ్లిన వధువు కిడ్నాప్
  • కారులో తీసుకెళ్లిపోయిన దుండగులు
  • రంగంలోకి దగిన 4 పోలీసు టీములు

మరి కొన్ని గంటల్లో పెళ్లి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతలో పెళ్లికూతురును కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటన పంజాబ్ లో చేటు చేసుకుంది. పెళ్లి అలంకరణ కోసం వధువు బ్యూటీ పార్లర్ కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న దుండగులు కాపుకాసి, వధువు బయటకు రాగానే ఆమెను అడ్డుకున్నారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిపోయారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు 4 టీమ్ లను ఏర్పాటు చేశారు. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

More Telugu News