Andhra Pradesh: విజయనగరంలో ఓటర్ లిస్ట్ తో సర్వే.. అడ్డుకున్న వైసీపీ నేత మజ్జి శ్రీనివాస్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • సర్వే నిర్వహించిన ప్రైవేటు కంపెనీ
  • అడ్డుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు
  • ట్యాబ్ లు లాక్కున్న మజ్జి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో నిన్న ఉద్రిక్తత తలెత్తింది. జిల్లాలోని నెల్లిమర్లలో ఉన్న కుమిలిలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ఓటర్ జాబితాతో సర్వే నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. సర్వే విషయం తెలుసుకున్న వైసీపీ నేత మజ్జి శ్రీనివాస్, కార్యకర్తలు వీరిని అడ్డుకున్నారు. అనంతరం సర్వే కోసం వాడుతున్న ట్యాబ్ లను లాక్కుని ఈ వ్యక్తులను పోలీసులకు అప్పగించారు.

అయితే సదరు ట్యాబ్ లను మజ్జి శ్రీనివాస్ తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో ట్యాబ్ లు తమకు ఇవ్వాలని కోరినా మజ్జి శ్రీనివాస్ స్పందించకపోవడంతో పోలీసులు ఆయన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం ఏం జరగబోతోందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

More Telugu News