ISRO: ఇస్రో ఖాతాలో మరో విజయం.. పీఎస్ఎల్‌వీ-సి44 ప్రయోగం విజయవంతం

  • రెండు ఉప గ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్‌వీ
  • కలాంశాట్‌ను రూపొందించిన తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు
  • రక్షణ రంగ అవసరాలు తీర్చనున్న మైక్రోశాట్-ఆర్ 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి గురువారం అర్ధరాత్రి నిర్వహించిన పీఎస్ఎల్‌వీ-సి44 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన రాకెట్.. దేశ రక్షణశాఖ అవసరాల కోసం ఉద్దేశించిన 740 కిలోల మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహంతో పాటు, తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన 1.2 కిలోల బరువున్న 'కలాంశాట్'ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28 గంటలపాటు నిరంతరాయంగా సాగింది. సరిగ్గా గురువారం రాత్రి 11:37 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎవరైనా ఉపగ్రహాలు తయారు చేసుకుని తీసుకొచ్చి ఇస్రో నుంచి ప్రయోగించవచ్చని తెలిపారు. కలాంశాట్‌ను తయారుచేసిన తమిళనాడు విద్యార్థులను ఆయన అభినందించారు.

More Telugu News