Narendra Modi: సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపికపై చర్చ.. నిర్ణయానికి రాలేకపోయిన కమిటీ!

  • మరోసారి నూతన డైరెక్టర్ ఎంపిక వాయిదా
  • 1982 - 85 బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పేర్ల పరిశీలన
  • పరిశీలనలో జేకే శర్మ, పరమిదర్ రాయ్, వీణామిత్ర పేర్లు 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపికపై చర్చ జరిగింది. కానీ కమిటీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపిక మరోసారి వాయిదా పడింది. ఈ సమావేశంలో 1982 - 85 బ్యాచ్ వరకూ ఉన్న ఐపీఎస్ అధికారుల పేర్లను సీబీఐ డైరెక్టర్ పదవి కోసం పరిశీలించినట్టు సమాచారం. కాగా, 1982వ బ్యాచ్‌కు చెందిన జేకే శర్మ, పరమిదర్ రాయ్, వీణామిత్ర తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

More Telugu News