varun tej: మెగాహీరో తదుపరి సినిమాకి ముహూర్తం ఫిక్సయింది

  • 'ఎఫ్ 2'తో హిట్ కొట్టిన వరుణ్ తేజ్ 
  • 'జిగర్తాండ' రీమేక్ కి సన్నాహాలు
  • ఈ నెల 27న పూజా కార్యక్రమాలు    

వరుణ్ తేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆయన తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ సింహా .. సిద్ధార్థ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.

తమిళంలో బాబీ సింహా విలన్ షేడ్స్ కలిగిన డాన్ పాత్రలో కనిపిస్తాడు. తెలుగులో ఈ పాత్రను చేయడానికి వరుణ్ తేజ్ అంగీకరించాడు. ఇక సిద్ధార్థ్ పాత్రకు మరో యంగ్ హీరోను ఎంపిక చేయవలసి వుంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట నిర్మిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

More Telugu News