Telangana: పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి.. హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

  • కొడంగల్  లో రేవంత్ పై పట్నం విజయం 
  • పట్నం నరేందర్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించారన్న రేవంత్ 
  • అనర్హత వేటు వేయమన్న కాంగ్రెస్ నేత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పట్నం నరేందర్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలనీ, అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై పోటీచేసిన పట్నం నరేందర్ రెడ్డి 10,770 ఓట్ల మెజారిటీతో రేవంత్ పై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News