Telangana: హాస్టల్ నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయిన బాలుడు!

  • తెలంగాణలోని కరీంనగర్ లో ఘటన
  • తొమ్మిదో తరగతి చదువుతున్న అశ్విన్
  • కేసు నమోదు చేసిన పోలీసులు

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి పద్మానగర్ లోని పారమిత రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థి సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న అశ్విన్(14) నీటి సంపులో పడిపోయి ఉండటాన్ని గమనించిన యాజమాన్యం వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదుచేశారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.

More Telugu News