nagarjuna: ఏఎన్నార్ బయోపిక్ గురించి మాట్లాడిన నాగార్జున

  • రేపు థియేటర్లకు రానున్న 'మిస్టర్ మజ్ను'
  • అక్కినేని బయోపిక్ తీసే ఉద్దేశం లేదు
  • పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన నాగార్జున  

అఖిల్ కథానాయకుడిగా రూపొందిన 'మిస్టర్ మజ్ను' రేపు భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ, ఏఎన్నార్ బయోపిక్ గురించి జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు."అక్కినేని నటించిన సినిమాలు రీమేక్ చేయడానికే మేము భయపడుతున్నాము. అలాంటిది ఆయన బయోపిక్ ను తీసే సాహసం చేయలేము.

అక్కినేనికి ఘన నివాళిగా అందించే బయోపిక్ పరాజయం పాలైతే మేము తట్టుకోలేము" అంటూ ఏఎన్నార్ బయోపిక్ తీసే ఉద్దేశం తమకి ఎంతమాత్రం లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అక్కినేని బయోపిక్ ను ముందుగా వద్దనుకున్న నాగార్జున, ఆ తరువాత తన కుటుంబ సభ్యులతో చర్చించి .. మనసు మార్చుకున్నారంటూ జరిగిన ప్రచారానికి ఆ విధంగా ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అందువల్లనే నాగార్జున తన తండ్రి బయోపిక్ గురించిన ఆలోచన చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News