TG Venkatesh: స్క్రోలింగ్‌లు చూసి విమర్శించడం సరికాదు: పవన్‌కు టీజీ వెంకటేష్ సూచన

  • వినకుండా విమర్శించడం సరికాదు
  • కార్యకర్తలకు ఆవేశం ఉంటుంది
  • నాయకులకు ఆవేశం పనికి రాదు

టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటన్న టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడిన సంగతి విదితమే. అయితే తాను ఏం మాట్లాడానో వినకుండా విమర్శించడం నాయకుడి లక్షణం కాదని టీజీ పేర్కొన్నారు. ఈ సాయంకాలం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తానేం మాట్లాడానో పూర్తిగా వినకుండా.. స్క్రోలింగ్‌లు చూసి విమర్శించడం సరికాదన్నారు. కార్యకర్తలకు ఆవేశం ఉంటుంది కానీ నాయకులకు ఆవేశం పనికిరాదన్నారు. ఏదైనా ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడాలని టీజీ వెంకటేష్ సూచించారు.

More Telugu News