Mahesh Babu: సుకుమార్ తో మహేశ్ మూవీ అడవి నేపథ్యంలో సాగుతుందట!

  • 'మహర్షి' షూటింగులో మహేశ్ బాబు
  • తదుపరి సినిమా సుకుమార్ తో 
  • త్వరలో మిగతా వివరాలు  

ప్రస్తుతం మహేశ్ బాబు 'మహర్షి' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు .. సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. దాంతో కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.

ఈ సినిమా అడవి నేపథ్యంలో కొనసాగుతుందనేది తాజా సమాచారం. 'రంగస్థలం' కథ గోదావరి నేపథ్యంలో ఎలా సాగుతుందో, ఈ కథ అలా అడవి నేపథ్యంలో నడుస్తుందని అంటున్నారు. కథ మహేశ్ బాబుకి బాగా నచ్చేసిందట. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఆయన కూడా ఆసక్తిని చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మే నెలలో గానీ .. జూన్ లో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావొచ్చని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News