Telugudesam: ఏపీలో టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

  • ఏపీలో ఒంటరిగానే బరిలోకి దిగుతాం
  • 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం
  • ఈనెల 31న జరిగే భేటీలో ఎన్నికల కార్యాచరణ రూపొందిస్తాం

ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందా? లేదా? అనే సందేహాలకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమన్ చాందీ స్పష్టం చేశారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెలలో బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించామని... ఈ యాత్రపై మరోసారి సమావేశమై చర్చిస్తామని అన్నారు.

ఎన్నికల కార్యాచరణను రూపొందించడానికి ఈనెల 31న మరోసారి సమావేశమవుతామని చెప్పారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నెలలోనే ఎన్నికల కమిటీకి సంబంధించిన నివేదికను అధిష్ఠానానికి పంపుతామని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

More Telugu News