ram: 'ఇస్మార్ట్ శంకర్'కి జోడీ దొరికేసింది

  • రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్'
  • ఈ రోజే పట్టాలెక్కిన ప్రాజెక్ట్
  • మే నెలలో విడుదల  

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా 'ఇస్మార్ట్ శంకర్' ఈ రోజునే పట్టాలెక్కింది. ఈ సినిమా టైటిల్ .. రామ్ లుక్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రామ్ తన కెరియర్ లో ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాడనే విషయం అర్థమైపోయింది. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా ద్వారా కొత్త కథానాయిక పరిచయమవుతుందనే టాక్ వినిపించింది. అయితే తాజాగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు తెరపైకి వచ్చింది.

అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకోవాలనే నిర్ణయానికి పూరి వచ్చాడని, ఆమెనే ఖరారు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో అనూ ఇమ్మాన్యుయేల్ కి హిట్ పడలేదు. 'అజ్ఞాతవాసి' .. 'నా పేరు సూర్య' .. 'శైలజా రెడ్డి అల్లుడు' ఆమెకి నిరాశనే మిగిల్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఈ ఛాన్స్ రావడం విశేషమే. తొలిసారిగా రామ్ జోడీ కడుతోన్న ఆమెకి, ఈ సినిమాతోనైనా హిట్ తగులుతుందేమో చూడాలి. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  

More Telugu News