India: 12 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు ఫట్... న్యూజిలాండ్ ఆలౌట్!

  • 157 పరుగులకు ఆలౌట్ అయిన న్యూజిలాండ్
  • కుల్ దీప్ యాదవ్ కు 4 వికెట్లు
  • 64 పరుగుల స్కోరు వద్ద విలియమ్సన్ అవుట్

నేపియర్ లో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 157 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. కుల్ దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి రాణించగా, ఆట ఆరంభంలో మహమ్మద్ షపీ ప్రధాన ఆటగాళ్లను దెబ్బతీసేలా 3 కీలక వికెట్లు తీశాడు. చాహాల్ కు 2, జాదవ్ కు 1 వికెట్ లభించింది. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్ కుల్ దీప్ బౌలింగ్ లో శంకర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన తరువాత న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎంతోసేపు నిలదొక్కుకోలేదు. 145 పరుగుల వద్ద 6 వికెట్లతో ఉన్న జట్టు మరో 12 పరుగులు జోడించేలోపే చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది. మరికాసేపట్లో 158 పరుగుల విజయలక్ష్యంతో భారత జట్టు మైదానంలోకి దిగనుంది.

More Telugu News