Yatra: ఒక్క కట్ కూడా లేకుండా 'యాత్ర' సెన్సార్ పూర్తి!

  • వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర మెయిన్ లైన్ గా చిత్రం
  • సినిమాకు ఇబ్బందులు ఉంటాయని భావించిన విశ్లేషకులు
  • క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర మెయిన్ లైన్ గా, మహి వి రాఘవ్ తెరకెక్కించిన 'యాత్ర' చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డ్ ఇచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ అంత సులువుకాదని, ఇబ్బందులు తప్పవని భావించిన వారికి షాకిస్తూ, 'యూ' సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు సభ్యులు, సినిమా బాగుందని వ్యాఖ్యానించారట.

ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించిన చిత్ర యూనిట్, సెన్సార్ బోర్డు మెంబర్స్ అభినందనలు తెలిపారని పేర్కొంది. కాగా, వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషించిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖులు ఇతర పాత్రలను చేశారు. ఈ సినిమాను భలే మంచిరోజు, ఆనందో బ్రహ్మ వంటి చిత్రాలను నిర్మించిన 70 ఎంఎం ఎంటర్ టెయిన్ మెంట్స్ నిర్మించగా, వచ్చే నెల 8న ఇది విడుదల కానుంది. చాలా కాలం తరువాత మమ్ముట్టి నటించిన డైరెక్ట్ తెలుగు చిత్రం ఇదే కావడంతో సినిమాపై అంచనాలూ భారీగానే ఉన్నాయి. 

More Telugu News