రూ.1699: సంవత్సరం వ్యాలిడిటీతో ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్

  • రూ.1699 రీఛార్జి ప్లాన్ ప్రకటన 
  • 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 1 జీబీ డేటా
  • అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు 

టెలికాం రంగ సంస్థ భారతీ ఎయిర్ టెల్ తన ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం రూ.1699 రీఛార్జి ప్లాన్ ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 1 జీబీ డేటా లభించే ఈ ఆఫర్లో భాగంగా కస్టమర్లు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, దీనిలో రోజుకి 100 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పంపుకునే వీలుంది. కాగా, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ నెట్ వర్క్ సంస్థలు ఇప్పటికే సంవత్సరం వ్యాలిడిటీ గల ప్లాన్లని అందిస్తున్నాయి.

More Telugu News