Ys jagan: వైఎస్ జగన్ సీట్లు అమ్ముకుంటున్నారు: రాధా-రంగా మిత్ర మండలి ఆరోపణలు

  • ‘మాట తప్పను, మడమ తిప్పను’ అంటే ఇదేనా?
  • రాధా-రంగా అభిమానులెవ్వరూ వైసీపీకి ఓటేయొద్దు
  • ఈ వ్యాఖ్యలపై ఇంకా స్పందించని వైసీపీ

వచ్చే ఎన్నికల విషయంలో విజయవాడ సెంట్రల్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వంగవీటి రాధా  వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా-రంగా మిత్ర మండలి సభ్యులు జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ టికెట్లను జగన్ అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మాట తప్పను, మడమ తిప్పను’ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. విజయవాడలోని రాధా-రంగా అభిమానులు మాత్రమే కాకుండా, రాష్ట్ర ప్రజలెవ్వరూ వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపు నిచ్చారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఇంకా స్పందించాల్సి ఉంది.

More Telugu News