Akhil Akkineni: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టర్ మజ్ను’

  • అఖిల్ హీరోగా ‘మిస్టర్ మజ్ను’
  • అంచనాలను పెంచేసిన ట్రైలర్
  • ఈ నెల 25న విడుదల

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులను పూర్తి చేసుకుంటోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News