Chandrababu: ఏపీ మంత్రివర్గ సమావేశం.. పలు కీలక విషయాలపై నిర్ణయాలు వెలువడే అవకాశం

  • డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం
  • అగ్రిగోల్డ్ బాధితుల అంశాలపై చర్చ
  • అసెంబ్లీ సమావేశాల నిర్వహణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం కింద రూ.10 వేలు ఇచ్చే విషయంతో పాటు పలు కీలక విషయాలపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు గ‌ృహ వసతి కల్పించే అంశం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, అగ్రిగోల్డ్ బాధితుల అంశాలపై చర్చ నిర్వహించనున్నారు. ముఖ్యంగా రైతుల పెట్టుబడికి సాయం అందించే విషయం, ఆ సాయాన్ని ఈ ఖరీఫ్ సీజన్ నుంచే నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసే అంశంపై మంత్రులు చర్చిస్తున్నారు.

More Telugu News