chiranjeevi: చిరూ .. కొరటాల ప్రాజెక్టుపై పుకార్లకు సమాధానం

  • చిరంజీవితో కొరటాల సినిమా వుంది
  •  ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి
  • ఆల్రెడీ స్క్రిప్ట్ ను లాక్ చేశాము        

ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా చేస్తున్నారు .. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశం వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉండనుంది. అయితే కథ ఇంకా ఫైనలైజ్ కాలేదనీ .. అసలు ప్రాజెక్టే ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించనున్న మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ .. కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు.

ఈ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. స్క్రిప్ట్ లాక్ అయింది .. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారమే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 'సైరా' షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా విషయంలో మరింత స్పష్టతను ఇవ్వగలము" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నయనతారనుగానీ .. అనుష్కను గాని కథానాయికగా ఎంచుకునే అవకాశాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

More Telugu News