LakshmisNTR: వైట్ డ్రెస్, పసుపు రంగు కండువాలతో ఉన్న వ్యక్తుల ఫోటో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుండి మరో ఫోటో 
  • వైట్ డ్రెస్, పసుపు రంగు కండువాలతో ఉన్న వ్యక్తులు 
  • వైరల్ గా మారిన ఫోటో

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి వర్మ ఇప్పటికే ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడు లుక్స్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. తాజాగా మరొక ఫోటో తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది వ్యక్తులు దీనిలో వైట్ డ్రెస్, పసుపు రంగు కండువాలు ధరించి భోజనం చేస్తున్నట్లుగా ఉంది.

More Telugu News