devisri: కథతో సుకుమార్ ను ఒప్పించడమే గొప్ప విషయం: దేవిశ్రీ ప్రసాద్

  • మైత్రీవారితో స్నేహం వుంది
  • సుకుమార్ కి కథాకథనాలపై మంచి పట్టుంది
  • బుచ్చిబాబు చెప్పిన కథ కొత్తగా వుంది    

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఈ రోజునే పట్టాలెక్కింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .."మెగా హీరోల్లో ఒక్క అల్లు శిరీష్ కి మినహా మిగతా హీరోలందరి సినిమాలకి సంగీతాన్ని అందించాను. అటు మైత్రీ మూవీ మేకర్స్ వారితోను .. ఇటు సుకుమార్ తోను నాకు సన్నిహిత సంబంధాలు వున్నాయి.

ఇద్దరూ కలిసి నిర్మిస్తోన్న సినిమాకి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు నాకు బాగా తెలుసు. కథా కథనాల్లో సుకుమార్ కి మంచి పట్టుంది. అలాంటి ఆయనకి కథ చెప్పి ఒప్పించడం అంత తేలికైన పనికాదు. ఆ పనిని బుచ్చిబాబు చేయడాన్ని బట్టి ఆయన ప్రతిభను అంచనా వేయవచ్చు. నాకు బుచ్చిబాబు కథ చెప్పాడు .. చాలా కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంతమంచి ప్రాజెక్టుకి వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది" అని అన్నాడు. 

More Telugu News