vaishnav tej: వైష్ణవ్ తేజ్ జోడీగా తెలుగు అమ్మాయే

  • హీరోగా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా
  • కథానాయికగా మనీషా రాజ్
  •  ప్రేమకథా నేపథ్యంలో సాగే సినిమా      

చిరంజీవికి మరో మేనల్లుడైన వైష్ణవ్ తేజ్, కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగంలోకి దిగాడు. ఆయన తొలి సినిమా ఈ రోజునే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయిక తెలుగు అమ్మాయేననే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఆ అమ్మాయి పేరు 'మనీషా రాజ్' అనీ .. తాను ఓ ఎన్నారై అని తెలుస్తోంది.

కథ ప్రకారం ఆమె అయితేనే బాగుంటుందని భావించి ఎంపిక చేసినట్టుగా సమాచారం. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. ఇది ఎంతో సహజంగా అనిపించే అందమైన ప్రేమకథా చిత్రమని అంటున్నారు. యూత్ హృదయాలను ఈ సినిమా కొల్లగొట్టేయడం ఖాయమని చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ కి హిట్ ఇవ్వాలనే గట్టిపట్టుదలతో దర్శకుడు బుచ్చిబాబు వున్నాడు. ఇక మనీషా రాజ్ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. 

More Telugu News