Andhra Pradesh: విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో మరో అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం!

  • ప్లాంట్ లోని ఎస్ఎంఎస్ లో చెలరేగిన మంటలు
  • పూర్తిగా కాలిపోయిన పంప్ హౌస్
  • విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని ఎస్ఎంఎస్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. దీంతో మంటలు భారీఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న పంప్ హౌస్ దగ్ధమయింది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

ఈ విషయమై ప్లాంట్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.కోట్లలో ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. మరోపక్క, రెండ్రోజుల క్రితం ప్లాంట్ లోని ఫర్నేస్-3లో ఉన్న బ్లోపైప్ పేలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

More Telugu News