Bahubali: వీరిద్దరూ ఎవరో గుర్తించగలరా?... అభిమానులకు రామ్ గోపాల్ వర్మ ప్రశ్న!

  • ట్విట్టర్ లో పోస్టు పెట్టిన వర్మ
  • ఎవరో గుర్తించేందుకు సాయం చేయాలని కోరిక
  • బాహుబలి చిత్రాన్ని మార్ఫింగ్ చేయించిన వర్మ

రామ్ గోపాల్ వర్మ... ఆ పేరు వింటే తొలుత గుర్తొచ్చేది వివాదాలే. సోషల్ మీడియాలో తాను చేసే వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూ, కొత్త చర్చలకు తెరలేపే వర్మ, ప్రస్తుతం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాలోని 'వెన్నుపోటు' అనే పాటను విడుదల చేయగా, తెలుగుదేశం వర్గాల నుంచి తీవ్ర విమర్శలు సైతం వచ్చాయి. తాజాగా, 'బాహుబ‌లి' సినిమాలో కట్టప్ప వెన్నుపోటు పొడిచిన పోస్టర్ ను కాస్త మార్పు చేసి, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ, ఈ చిత్రంలో వ్యక్తులు ఎవరో గుర్తించేందుకు తనకు సాయం చేయాలని కోరారు. ఇందులో బాహుబలి ముఖం ఎన్టీఆర్ మాదిరిగా, కట్టప్ప ముఖం చంద్రబాబు మాదిరిగా కనిపిస్తోంది. తన కొత్త చిత్రంపై మరింత హైప్ ను పెంచేందుకే ఆయన ఈ పని చేశారని తెలుస్తోంది.




More Telugu News